మరో యంగ్ దర్శకుడితో రవితేజ సినిమా...!!

murali krishna
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం భారీ స్పీడ్ లో ఉన్నాడు.. వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్ గా  అయితే నటించింది.. క్రిస్మస్ కానుకగా విడుదల అయిన ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించి రికార్డ్ ను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా హిట్ అయిన వెంటనే మళ్ళీ వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సంక్రాంతి పండుగకు వచ్చాడు.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.. ఈ సినిమాలో రవితేజ నటనకు ఫ్యాన్స్ దాసోహం అయ్యారు... ఇలా మాస్ రాజా వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకోవడంతో వారు చాలా ఖుషీగా ఉన్నాడు.. ఇక ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి..

రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.. ఈ రెండు కొద్దీ రోజుల్లోనే షూట్ ను పూర్తి చేసుకొనున్నాయి.. దీంతో రవితేజ ఇప్పుడు మంచి స్పీడ్ మీద ఉండడంతో మరిన్ని సినిమాలను అయితే లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అని తాజాగా వార్తలు కూడా వస్తున్నాయి.. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరంటే ప్రశాంత్ వర్మ అని సమాచారం... ఈ డైరెక్టర్ ఎప్పటి నుండో మంచి హీరో కోసం ఎదురు చూస్తున్నాడు.. ఇటీవలే బాలయ్య అన్ స్టాపబుల్ షో టీజర్ కు కూడా దర్శకత్వం వహించాడు.. ఈ టీజర్ తో బాలయ్య బాగా కనెక్ట్ అవ్వడంతో ఈయన సినిమా చేయాలని అయితే అనుకున్నాడు.. కానీ బాలయ్య లైనప్ కారణంగా ఈయనతో సినిమా చేయడానికి టైం పడుతుందని సమాచారం... అయితే ఈ లోపు రవితేజతో సినిమా చేయాలని ప్రశాంత్ వర్మ ఇప్పటికే కథ కూడా చెప్పారని ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: