ప్రభాస్ మిర్చి హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు వచ్చి తమ అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని.. మంచి విజయాలు సాధించినప్పటికీ.. ఎందుకో అదృష్టం కలిసి రాక అవకాశాలు రాక చివరికి ఇండస్ట్రీలో కనుమరుగు అయిపోతుంటారు అని చెప్పాలి  ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక ఇలా అవకాశాలు లేక కనుమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు అని చెప్పాలి. ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తన అందం అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

 ఇక టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఇక అభిమానులను సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక ఈ అమ్మడి ఖాతాలో మంచి సూపర్ హిట్ సినిమాలు కూడా చేరిపోయాయి. అయితే ఇక స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడో ఈ అమ్మడిని దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి. ఇప్పుడు ఇక ఇండస్ట్రీలో లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి  సినిమాలో అనుష్కతో పాటు రిచా గంగోపాధ్యాయ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.

 తన అంద చందాలతో ఇక కుర్రకాలను ఫిదా చేసేసింది అని చెప్పాలి. ఇక మిర్చి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత రిచా గంగోపాధ్యాయ కి వరుస అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. చివరగా నాగార్జున హీరోగా వచ్చిన బాయ్ సినిమాలో నటించి ఇక తర్వాత జో లాంగీల అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ఇక ప్రస్తుతం ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. ఇక తన ఫ్యామిలీతో కలిసి పోర్ట్ ల్యాండ్ లోని ఒరే గావ్ లో జాబ్ చేస్తూ అక్కడే స్థిరపడిందట ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: