వాల్తేరు వీరయ్య.. భోళా శంకర్ నిర్మాతలకు ప్లస్ కానుందా..?
ఈ సినిమా ఫలితం ఆయన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్ పై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ చిరంజీవి ముందు జాగ్రత్తగా ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలో కొంచెం మార్పులు చేసి సినిమా రిలీజ్ చేయగా పర్వాలేదనిపించుకుంది. ఈ ఏడాది చిరంజీవి హీరోగా ..శృతిహాసన్ హీరోయిన్గా బాబి కొల్లి డైరెక్షన్లో జనవరి 13వ తేదీన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన చిత్రం వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేశారు. చిరంజీవి చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సినిమాకు నీరాజనం పట్టారు.
అతి తక్కువ సమయంలోనే యూఎస్ఏ లో 2 మిలియన్ మార్కును కూడా దాటేసిన వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని చిరంజీవికి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా విజయం కావడంతో భోళా శంకర్ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. నిజానికి వాల్తేరు వీరయ్య విజయం భోళా శంకర్ నిర్మాతలకు ప్లస్ కానుంది అని ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.