తెలుగు రాష్ట్రాలలో సందడి చేయనున్న పఠాన్ టీమ్..!

Divya
షారుక్ ఖాన్ హీరోగా..  దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం పఠాన్.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ వర్గాలలో ఆసక్తితోపాటు ఉత్కంఠ కూడా పెరుగుతోంది. నిజానికి చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు బయటకి వస్తూ ఉండడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ లభించింది.  ఇందులో జాన్ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.  ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  గత రెండు రోజుల క్రితం దుబాయ్ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా లో ప్రదర్శించి విడుదల చేస్తామని చిత్ర బృందం ఆసక్తికరమైన విషయాన్ని శనివారం రోజు వెల్లడించింది.
ఇకపోతే యశ్ రాజు ఫీలింమ్స్ పతాకం పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా జనవరి 25వ తేదీన తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను శెర వేగంగా చేపడుతున్నారు చిత్రబంధం.  ఈ క్రమంలోనే పఠాన్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చే వారంలోపు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలను సందర్శించి సినిమాను ప్రమోట్ చేయాలని పఠాన్ టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో సుమారుగా 50వేల మందికి పైగా సినిమాను తిలకించనున్నారు.  అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని షారుక్ ఫ్యాన్ క్లబ్ ఎస్ ఆర్ కె యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది.
ముఖ్యంగా ఢిల్లీ,  హైదరాబాద్ , ముంబై తో సహా రద్దీగా ఉండే పట్టణాలలో 200 థియేటర్లలో అభిమానుల కోసం ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది అని క్లబ్ సహ వ్యవస్థాపకుడు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి మరి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా హిట్టు కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: