మొదటిరోజు అతి తక్కువ థియేటర్లలో "కళ్యాణం కమనీయం" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న యువ హీరోలను ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కొంత కాలం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అల్లరించలేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో కళ్యాణం కమనీయం అనే మూవీ లో హీరోగా నటించాడు. అనిల్ కుమార్ అల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా , యువి క్రియేషన్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉన్నప్పటికీ ఈసారి సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ... బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి ... అజిత్ హీరోగా తెరకెక్కిన తెగింపు ... విజయ్ హీరోగా తెరకెక్కిన వారసుడు మూవీ లు కూడా విడుదల కావడంతో ఈ మూవీ కి అతి తక్కువ థియేటర్ లు మాత్రమే దొరికాయి. ఈ మూవీ ఈరోజు కేవలం 100 థియేటర్ లలో మాత్రమే విడుదల అయింది. మరి అతి తక్కువ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి మొదటి రోజు ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: