వారిసు: విడుదలకు ముందే విజయ్ కి షాక్?

Purushottham Vinay
ప్రముఖ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా విడుదల అవుతుంది. టాలీవుడ్‌ సక్సెస్ ఫుల్ స్టార్‌ డైరెక్టర్లలో ఒకరైన వంశీ పైడిపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రూపొందించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో తెలుగు వెర్షన్‌ను జనవరి 14 వ తేదీకి వాయిదా వేసినట్లు దిల్‌రాజు తెలిపాడు. ఇదిలా ఉంటే వారసుడు మూవీ ట్రైలర్‌ మంచి వ్యూస్ రాబడుతూ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. వ్యూస్‌ పరంగా మంచి రికార్డులు కొల్లగొడుతోంది. ఇంకా అదే సమయంలో చాలామంది కూడా వారసుడు ట్రైలర్‌ ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా గతంలో వచ్చిన బృందావనం, బ్రహ్మోత్సవం, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, మహర్షి, అత్తారింటికి దారేది ఇంకా అజ్ఞాతవాసి వంటి మూవీలను మిక్స్‌ చేసి  తెరకెక్కించారంటూ నెట్టింట ట్రోల్స్‌ ఎక్కువగా వస్తున్నాయి.


ఇక పలు తమిళ్‌ వెబ్‌సైట్లు కూడా ఈ మూవీలో అసలు కొత్త పాయింట్‌ అనేదే ఏం లేదంటూ పాత చింతకాయ పచ్చడేనంటూ పలు కథనాలు కూడా రాసుకొస్తున్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి సరికొత్త పాయింట్‌తో వారసుడు మూవీని తెరకెక్కించారని చిత్రబృందం బాగా ధీమా వ్యక్తం చేస్తోంది.ఇక వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే పెద్ద వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో విజయ్‌ తల్లిదండ్రులుగా శరత్‌ కుమార్‌ ఇంకా జయ సుధ నటిస్తున్నారు. శ్రీకాంత్, శ్యామ్‌లు విజయ్‌ కి అన్న పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ మెయిన్‌ విలన్‌గా కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రష్మిక మందన విజయ్‌ సరసన రొమాన్స్‌ చేయనుంది. వీరితో పాటు ప్రభు, ఖుష్బూ, యోగిబాబు ఇంకా సంగీత.. నందిని రాయ్‌ అలాగే గణేశ్‌ వెంకట్రామన్‌ వంటి నటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ అందించిన స్వరాలు ఇప్పటికే మంచి చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: