శాకుంతలం ట్రైలర్ రిలీజ్: స్టేజ్ పై ఏడ్చేసిన సామ్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నీలిమ గుణ, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణశేఖర్‌ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోయి ఇప్పుడు కెరీర్‌లో సరైన హిట్‌లు లేక సతమతమవుతోన్న గుణ శేఖర్‌కు ఈ మూవీ చాలా కీలకంగా మారింది. దీంతో ఈ మూవీపైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం నాడు మూవీ యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ తరువాత చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది.ఇక స్టేజ్‌పై చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ..ఈ సినిమాకు హీరో సమంతా ఇంకా వెనకాల హీరో దిల్‌రాజు అని తెలిపారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ చాలా ఎమోషన్‌కు గురయ్యారు. ఒకానొక సమయంలో ఏకంగా కంటతడి కూడా పెట్టుకున్నాడు. 


ఫిలిం మేకర్స్‌ మంచి తీయాలంటే మేకర్స్‌ కావాలంటూ గుణశేఖర్‌ చాలా ఎమోషన్‌ అయ్యారు. దీంతో అక్కడే కూర్చున్న సమంత కూడా ఒక్కసారిగా ఎమోషన్‌ అయ్యారు. మనసులో నుంచి ఉప్పొంగుతూ వచ్చిన బాధతో సమంత కూడా బోరున ఏడ్చేసింది. దీంతో సభకు హాజరైన కొంతమంది అభిమానులు అరడవంతో సమంత మళ్లీ నవ్వేసింది. సమంత భావోద్వేగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇక ఈ ఈవెంట్‌లో మాట్లాడిన సమంత… దర్శకుడు గుణశేఖర్‌ ఇంకా అలాగే నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాళిదాసు 5వ శతాబ్ధంలో రాసిన శాకుంతలలానికి గుణశేఖర్‌ తనను సెలెక్ట్ చేసుకోవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. జీవితంలో తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అభిమానులు నన్ను ప్రేమించడం మాత్రం తగ్గలేదు. శాకుంతలం సినిమాతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని సమంత ధీమా వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: