వారసుడు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టనున్న విజయ్.. కారణం..?

Divya
జనవరి 12వ తేదీన భారీ బడ్జెట్ తో నేరుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తెలుగులో చేస్తున్న సినిమా వారసుడు. బై లింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళంలో వారిసు పేరిట రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిసెంబర్ 24వ తేదీన గత ఏడాది చెన్నైలో వారిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించి.. ఆ తర్వాత సన్ టీవీలో జనవరి ఒకటిన స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దిల్ రాజు,  రష్మిక మందన్న మాత్రమే హాజరు కాబోతున్నారట.  అంతేకాదు తెలుగు వర్షన్ పై విజయ్ దళపతి అసంతృప్తి వ్యక్తం చేయడం వల్లే ఆయన ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేయగా.. ట్రైలర్ పూర్తిస్థాయిలో ట్రోల్ అవుతోంది. అజ్ఞాతవాసి,  శ్రీమంతుడు, అత్తారింటికి దారేది అంటూ ఇలా మొత్తం ఆరు సినిమా కథలను మార్చి మార్చి వారసుడు పేరిట తెరకెక్కించారు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాల కంటే వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్ లు కేటాయించినప్పటికీ.. టికెట్ బుకింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు.  మరి ఇలాంటి సమయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని.. అందుకే తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్రం యూనిట్ అధికారికంగా స్పందిస్తే మాత్రం అసలు కారణమేమిటో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: