వీరసింహా రెడ్డి లో వినిపించునున్న ఎన్టీఆర్ వాయిస్...!!

murali krishna
ఎన్టీఆర్ మరియు బాలయ్య కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కడంతో పాటు ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా ఊహించని స్థాయిలో అయితే విజయాలను సొంతం చేసుకున్నాయి.
బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రాజకీయ, కుటుంబ కారణాల వల్ల ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది సులువైన విషయం అయితే కాదు.
అయితే వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య హీరోగా నటించగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోయినా వినిపిస్తాడని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో జై బాలయ్య అనే డైలాగ్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ అరిచిన వ్యక్తులలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని సమాచారం అయితే అందుతోంది. ఈ విధంగా వీరసింహారెడ్డి సినిమాలో ఎన్టీఆర్ వినిపిస్తారని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి ఈవెంట్ లో అరిచిన అరుపులకు సంబంధించిన వాయిస్ ను వీరసింహారెడ్డి సినిమాలో కూడా పెట్టారు. సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తుండగా ఒక పాత్ర పేరు వీరసింహారెడ్డి అయితే మరో పాత్ర పేరు బాల నరసింహారెడ్డి అని వార్త అందుతోంది. వీరసింహారెడ్డి సినిమా బుకింగ్స్ కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా అయితే జరిగింది. శృతి హాసన్ పాత్రకు ఈ సినిమాలో ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని కూడా సమాచారం. వీరసింహారెడ్డి మూవీ సెన్సార్ కార్యక్రమాలు అయితే పూర్తి కావాల్సి ఉంది. వీరసింహారెడ్డి కచ్చితంగా సూపర్ హిట్ అయి తీరుతుందని బాలయ్య కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బాలయ్య మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వినిపిస్తుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: