సేఫ్ జోన్ లో వీరయ్య !

Seetha Sailaja

ఈసారి సంక్రాంతి సినిమాల రేస్ కన్ఫ్యూజన్ లో ఉన్నంతగా మరెప్పుడు లేదు అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. దీనికికారణం ఒక్క ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ తప్ప సంక్రాంతి రేస్ లో ఉన్న ‘వీరసింహా రెడ్డి’ ‘వారసుడు’ సినిమాలు ఇంకా నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంలో తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఇండస్ట్రీ నుండి లీకులు వస్తున్నాయి.

‘వీరసింహా రెడ్డి’ కి అదేవిధంగా ‘వారసుడు’ మూవీకి సంగీత దర్శకుడు తమన్ అవ్వడంతో ఈ రెండు మూవీల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోరింగ్ అదేవిధంగా మిక్సింగ్ తమన్ చేయవలసి వస్తోంది. ఈ రెండు సినిమాల ఫైనల్ కాపీలు తయారు కావడంలో ఆలస్యం అవ్వడంలో ఇప్పుడు తమన్ ఈ రెండు సినిమాలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ ఒకేసారి చేయవలసి రావడంతో తమన్ రాత్రి ఉదయం పని చేస్తున్నా ఈమూవీల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చివరి నిముషం వరకు కొనసాగే పరిస్థితి ఉంది అంటూ లీకులు వస్తున్నాయి.

దీనికితోడు ‘వీరసింహా రెడ్డి’ మూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు కూడ పూర్తి కావలసి ఉందని అందువల్ల చివరి నిముషం వరకు బాలయ్య సినిమాకు టెన్సన్స్ తప్పవు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ‘వారసుడు’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో కూడ ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉండటంతో ఆమూవీకి కూడ చివరి నిముషం సమస్యలు ఏర్పడ్డాయి అని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే ‘వాల్తేర్ వీరయ్య’ పరిస్థితి మెరుగ్గా ఉందని దీనికి సంబంధించిన సెన్సారింగ్ కార్యక్రమాలు కూడ పూర్తి కావడంతో ఈసినిమాను ఏవిధంగా ప్రమోట్ చేయాలి అన్న విషయమై ఆ సినిమా యూనిట్ ఇప్పటికే ప్లాన్స్ వేయగాలుగుతోందని అంటున్నారు. అయితే ‘వీరసింహా రెడ్డి’ మూవీ ఈవిషయంలో వెనకడుగులో ఉండటంతో ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పూర్తి అయినప్పటికీ ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించిన టెన్షన్ ఈమూవీ యూనిట్ ను వెంటాడుతూ ఉండటంతో ప్రస్తుతానికి వీరయ్య సేఫ్ జోన్ లో ఉన్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: