బాలకృష్ణ మ్యానియా పై బుర్రా సాయి మాధవ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాయగల వ్యక్తి ఎవరు అంటే ఎవరికైనా బుర్రా సాయి మాధవ్ వెంటనే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాయడంలో బుర్రా సాయి మాధవ్ కు బాగా పట్టు ఉంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ ఘన విజయంలో బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయి అన్నవిషయం ఎవరూ కాదనలేని సత్యం.

లేటెస్ట్ గా ఈ సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘వీరసింహారెడ్డి’ మూవీకి సంబంధించిన డైలాగ్స్ బుర్రా వ్రాయడమే కాకుండా ఈమూవీ గురించి సంబంధించిన లీకులు ఇస్తూ ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుర్రా బాలకృష్ణ మ్యానియా పై సంచలన వ్యాఖలు చేసాడు.

టాప్ హీరోలు అందరూ తమను తాము తమ వీరాభిమానుల నుండి రక్షించుకోవడానికి బౌన్సర్లను పెట్టుకుంటారని అయితే అలాంటి అవసరం బాలయ్యకు లేదు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు బాలకృష్ణకు తన అభిమానులను కంట్రోల్ చేసే శక్తి ఉందని అవసరం అనుకుంటే బాలకృష్ణ తన అభిమానుల పై చెంపదెబ్బలు కొట్టడమే కాకుండా ఆతరువాత అదే వ్యక్తి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అతడి పై సోదర భావం చూపించే అరుదైన వ్యక్తిత్వం బాలయ్య సొంతం అంటూ బుర్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

వాస్తవానికి టాప్ హీరోల వ్యక్తిత్వంతో పోలిస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం చాల విభిన్నంగా ఉంటుంది. తన అభిమానులే తన దేవుళ్ళు అంటూ వారిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించే బాలకృష్ణ అదే అభిమానుల పై తన తీవ్ర అసహనాన్ని చూపెడతాడు అన్నది ఓపెన్ సీక్రెట్. బాలయ్యతో చెంప దెబ్బ తిన్నప్పటికీ అతడి అభిమానులు బాధపడరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసి ఉంటాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: