నరేష్ మూడవ భార్యకి KGF డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. ఆయన మూడవ భార్యగా గుర్తింపు తెచ్చుకున్న రమ్య గురించి మనందరికీ తెలిసిందే. మొదట ఈమె గురించి ఎవరికీ తెలియదు. దాని అనంతరం నరేష్ మరియు ఆయన తల్లి పేరును ఉపయోగించుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉండేది ఈమె. దాంతో చాలామందిని  మోసం చేసింది అంటూ వార్తల్లో నిలిచింది. దాని తర్వాత రమ్య తనకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో నిలిచింది.  పవిత్ర మరియు నరేష్ సహజీవనం చేస్తున్నారు అని వారిద్దరిని బెంగళూరులోని ఒక హోటల్ గదిలో మీడియాకు పట్టించింది ఈమె. అంతేకాదు అందులో భాగంగానే రమ్య పవిత్ర ను చెప్పుతో కొట్టే ప్రయత్నం కూడా చేసింది. అలా ఇలాంటి వార్తలతో కొన్ని నెలల పాటు వార్తల్లో నిలిచింది రమ్య.

ఇదిలా ఉంటే ఇప్పుడు రమ్య బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె ఎవరో కాదు కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు 2 సినిమాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్వయానా ఆమెకు సోదరుడు అని తెలుస్తుంది. అయితే ఈమె ఫ్యామిలీకి బెంగళూరులో స్టార్ హోటల్స్ ఉన్నాయి. దీంతో తన ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయింది. అంతేకాదు ప్రముఖ పొలిటిషియన్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి మరియు రమ్య తండ్రి ఇద్దరు అన్నదమ్ములు అని సమాచారం.ఈమె తండ్రి ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నారు అని.. చాలా సంవత్సరాల క్రితమే సీనియర్ నటుడు నరేష్ మరియు ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడని..

పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడివిడిగా ఉంటున్నారు అని తెలుస్తుంది. వీరిద్దరి మనస్పర్ధల కారణంగా నరేష్ ఈమెకి విడాకులు ఇవ్వాలని కోరాడట కానీ దానికి ఏమాత్రం అంగీకరించలేదు రమ్య. ఇందుకుగాను సీనియర్ నటుడు నరేష్ తల్లి విజయనిర్మలకు రమ్య... నరేష్ కి విడాకులు ఇవ్వను అని మాట ఇచ్చిందని అందుకే నరేష్ కు విడాకులు ఇవ్వట్లేదని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో నరేష్.. రమ్యకి తన డ్రైవర్తో అక్రమ సంబంధం ఉంది అని.. అందుకే తనకు విడాకులు ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: