రద్దీగా మారనున్న ఫిబ్రవరి 17.. ఏ సినిమాలు విడుదల అంటే..?
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీన మిగిలిన సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. జనవరి 11 నుంచి 13 వరకు అజిత్ తెగింపు, విజయ్ వారసుడు, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కినవే కావడం గమనార్హం. ఈ క్రమంలోని ఈ సినిమాలకు పోటీగా మరే సినిమా రావడం లేదు. అందుకే మిగిలిన సినిమాలను ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర బృందాలు సన్నహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17వ తేదీ థియేటర్లు రద్దీ గా మారనున్నాయి. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేసి క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు భారీ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే దిల్ రాజు ప్లాన్ ని ఫాలో అవుతూ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న సర్ సినిమా కూడా ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు ధమ్కి, ఆంటమాన్ 3, మైదాన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి .ఇప్పటివరకు ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది ఈ సినిమాలతో పాటు మరెన్ని సినిమాలు పోటీ పడబోతున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.