సెన్సార్ ను పూర్తి చేసుకున్న 'వాల్తేరు వీరయ్య'..

Satvika
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈ మూవీ రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాపీస్ వద్ద కుమ్మేయడం ఖాయమని అభిమానులు ఖుషి అవుతున్నారు.. గాడ్ ఫాదర్ సినిమా కన్నా కూడా ఎక్కువగా కలెక్షన్స్ ను అందుకుంటుందని అంచనాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి..

ఇది ఇలా ఉండగా.. తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమా కు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ను జారీ చేసింది. ఈ సినిమా తో చిరంజీవి తన అభిమానుల కు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని సెన్సార్ సభ్యులు మేకర్స్ ను అభినందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని.. చిరు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ తో మెగా ఫ్యాన్స్‌ కు ఫీస్ట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

వాల్తేరు వీరయ్య లో మరో సీనియర్ మాస్ రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తుండటం తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు పెరిగాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నారు. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయి లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది..  మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: