మళ్ళీ చిరు ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న యండమూరి..!

Divya
రచయిత యండమూరి వీరేంద్రనాథ్, చిరంజీవిల బంధం ఎంతో కాలం సాగింది. ముఖ్యంగా వారు రాక్షసుడు, ఛాలెంజ్ , జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిరస్మరణీయమైన చిత్రాలను చిరంజీవికి అందించారు. కానీ స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ అపజయం తర్వాత వారి మధ్య విషయాలు చేదుగా మారడంతో మళ్లీ వారు కలిసి పని చేయలేదు. గత కొంతకాలంగా యండమూరి కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోని కొన్ని సంవత్సరాల క్రితం అతను రామ్ చరణ్ ను అలాగే రామ్ చరణ్ విజయాలను తక్కువ చేయడానికి ప్రయత్నించాడు.
అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ పై చేసిన విమర్శల కోసం ఇప్పుడు మళ్లీ ఆయన వార్తల్లో నిలిచాడు.  గీతా రచయిత చంద్రబోస్ ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన అతను కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశాడు. అక్కడ అతను చిరు పాత్రను శివుడితో పోల్చాడు. దీనిపై చంద్రబాబు గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు. మొత్తానికైతే యండమూరి వీరేంద్రనాథ్ ఇలా చిరంజీవి ఫ్యామిలీ పై పగబట్టాడు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.  ఈ విషయంపై చిరంజీవి అభిమానులు కూడా కాస్త ఫీలవుతున్నారని చెప్పాలి.
ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించగా.. ప్రముఖ బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ , పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాతో విజయం సాధించి యండమూరికి చిరంజీవి చెక్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: