జబర్దస్త్ లోకి రోజా రీ ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

Satvika
సక్సెస్ ఫుల్ కామెడీ షో అంటే ఠక్కున
జబర్దస్త్ పేరు వినిపిస్తోంది.. అంతలా ఈ షో పాపులర్ అయ్యింది.. పదేళ్లు పూర్తీ చేసుకున్న ఈ షో గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంతో మంది ఈ షో ద్వారా చాలా మంది సినిమా అవకాశాలను అందుకున్నారు అక్కడ సక్సెస్ అయ్యారు. గత 10 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకొని ఎంతోమందినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా నిలబెట్టింది. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం వరుస సినిమాలు ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉన్నారు.

అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైన మొదట్లో ఈ కార్యక్రమానికి నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు మధ్యలోనే వెళ్లిపోగా రోజా మాత్రం తొమ్మిది సంవత్సరాల పాటు ఈ కార్యక్రమంలో చేశారు..ఈ షో లో కొనసాగుతూనే రాజకీయాల్లో చురుగ్గా ఉంది.. ప్రస్తుతం మంత్రి పదవి రావడం వాళ్ళ తనపై మరిన్ని బాధ్యతలు ఉన్నాయని ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.దాంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేకపోయినా కొన్ని తప్పనిసరి పరిస్థితుల వల్ల ఈమె ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. అయితే తాజాగా మరోసారి జబర్దస్త్ వేదికపై మెరిసారు..

వచ్చే గురు వారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.అందులో మంత్రి రోజా వేదికపై సందడి చేశారు. అయితే ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావడానికి గల కారణం.. ఈ కార్యక్రమం ప్రసారమయ్యే 500 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న నేపథ్యంలో రోజా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ మేరకు ఈమెకు ఈ కార్యక్రమంలో సన్మానం కూడా చేశారు..అది షోకు హైలెట్ అయ్యింది.  ఇక అప్పుడు రోజా మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్లను ప్రేక్షకులు మర్చిపోయారు. అయితే నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే అందుకు గల కారణం జబర్దస్త్ అంటూ రోజా గర్వంగా చెప్పింది.. మళ్ళీ జడ్జీగా చేస్తారా లేదా అన్నది తెలియాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: