బాలయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రస్తుతం జనవరి 12వ తేదీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన హీరోగా నటించిన అఖండ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా బాలయ్య అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని ఈ సినిమా కూడా అలాంటి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరుపొందిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి పోటీగా చాలా సినిమాలే విడుదల కానున్నాయి. చాలామంది బాలయ్య మీద ఉన్న నమ్మకంతో ఈసారి సంక్రాంతి విన్నర్ గా  బాలయ్య నిలుస్తాడు నన్ను కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బాలయ్య అభిమానులకు ఒక శుభవార్తను చెప్పాడు.అదేంటి అంటే కామెడీ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో తెరకెక్కనుంది అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు  అయితే వస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమాలో కో హీరోయిన్గా చాలామందిని సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా ప్రియాంక జ్వాలా కర్ ను ఫైనల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అంతేకాదు ఈమెతోపాటు ఈ సినిమాలో రష్మిక మందన కూడా నటించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన ఒక ఐటెం సాంగ్ లో బాలయ్యతో కలిసి నటించనుంది. అయితే ఇప్పటికే వరుస వివాదాలలో చిక్కుకున్న రష్మిక మందన బాలయ్యతో జతకట్టి ఐటమ్ సాంగ్ లో నటిస్తుంది అంటే ఒకసారిగా అందరూ షాక్ అవుతారు.ఏదైనా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక ఐటెం సాంగ్ వస్తుంది అంటే  అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీంతో బాలయ్య సినిమాలో రష్మిక మందన ఒక ఐటెం సాంగ్ చేస్తుంది అన్న వార్త  వార్త తెలిసిన నందమూరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: