SSMB28: పూజా హెగ్డే వద్దంటున్న మహేష్ అభిమానులు?

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా ఏళ్ల తరువాత వస్తున్న మూడవ సినిమా SSMB -28 ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఇప్పటికే చాలా సమయం కావస్తున్న కొన్ని కారణాల కారణంగా అంతకంతకు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.త్రివు ఈ సినిమా స్టోరీలో కూడా పలు మార్పులు చేయడం జరిగింది. మరికొన్ని పవర్ఫుల్ అంశాలతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం తెలుస్తోంది.అయితే ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు.ఈ సినిమాపై ఒక రేంజిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం మహేష్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అదేంటంటే హీరోయిన్ పూజా హెగ్డే. 


పూజా హెగ్డే అంటే మహేష్ అభిమానులకి అస్సలు నచ్చట్లేదు.ఆమెను సినిమా నుంచి తీసేయాలని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. పైగా తను ఈమధ్య వరుసగా ప్లాపులు ఎదురుకుంటూ ఐరన్ లెగ్ గా మారింది.పైగా పూజా హెగ్డే బిహేవియర్ కూడా అభిమానులకి నచ్చడం లేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయినా కూడా SSMB 28 టీం మహేష్ ఫ్యాన్స్ గోడు వినట్లేదు.ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏకంగా 230 కోట్ల వసూళ్ళని సాధించి మహేష్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.ఇక SSMB 28 ని మహేష్ పుట్టినరోజు సందర్బంగా వచ్చే ఏడాది విడుదల చెయ్యాలని టీం ప్లాన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: