అందుకే బాలయ్య షో కి రోజా రావడం లేదా..!?

Anilkumar
టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో సూపర్ సక్సెస్ను అందుకుంది. ఈ షో తో బాలయ్య తనలోని మరో యాంగిల్ ని కూడా చూపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోకా పేరు తెచ్చుకుంది. ఇటీవల సీజన్ వన్ పూర్తయినప్పటికీ ఇప్పుడు రెండవ సీజన్ కూడా ప్రారంభమైంది. సీజన్ వన్ కి మించి పోయేలా ఈ సీజన్ దూసుకుపోతుంది. 

అయితే బాలయ్య హోస్ట చేస్తున్న  ఈ షో కి రాజకీయ నాయకులు మరియు సినీ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా సందడి చేస్తున్నారు. మొదటగా ఈ షో ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు బాలయ్య అల్లుడు లోకేష్ ఇద్దరూ రావడం జరిగింది. ఇక ఆ షో ఎంతటి ఆదరణను పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే షోలో 4వ ఎపిసోడ్ కు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ ప్రస్తుత తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రసారమవుతున్న ఎపిసోడ్లలో ప్రభాస్ మరియు గోపీచంద్ వచ్చారు.

అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మరియు నటి అయిన రోజా కూడా వస్తుంది అనే వార్తలు గతంలో చాలా వినిపించాయి. అయితే స్వయంగా బాలయ్యే రోజాను పిలిచినట్లుగా తెలుస్తోంది.  దానికి రోజా ఒప్పుకోలేదట. అయితే ఈ వార్త తెలిసిన కొందరు ఎందుకు బాలయ్య పిలిచినప్పటికీ రోజా రాలేదు అనే వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ ప్రశ్నకి స్పందించింది రోజా. ఒక ఇంటర్వ్యూలో భాగంగా రోజా మాట్లాడుతూ నాకు బాలకృష్ణకి ఎలాంటి గొడవలు లేవు మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.   ఆయన కుటుంబానికి కూడా నేను తెలుసు. వారితో నాకు మంచి సన్నిహిత బంధాలు ఉన్నాయి. పార్టీ మారిన అనంతరం నేను వారికి కొంచెం దూరంగా ఉన్నాను. అంతే కాదు నా ప్రతి పుట్టినరోజుకి స్వయంగా బాలయ్య ఫోన్ చేస్తాడు అని చెప్పుకొచ్చింది. దాంతో పాటు బాలకృష్ణ నన్ను మొదటి సీజన్ లోనే రావాలని కోరారు కానీ నేను వెళ్లలేదు ఎందుకు అంటే నేను సినిమాలు ఆపేశాను కాబట్టి ఒకవేళ నేను వెళ్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు... మళ్ళీ అది వివాదాస్పదంగా మారుతుంది అలా జరగడం నాకు ఇష్టం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది రోజా ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: