బాలయ్య సినిమాలో మరో ట్విస్ట్.. మళ్ళీ అదే కథా..!?

Anilkumar
టాలీవుడ్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు.తాజాగా ఈయన నటించిన వీరసింహరెడ్డి జనవరి 12న విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ సినిమాలోని జై బాలయ్య మరియు సుగుణసుందరి పాటలు విడుదలయ్యి ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలతో తమన్ మ్యూజిక్ లవర్స్ ని అమాంతంగా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాల్లోని విడుదలైన రెండు పాటలతో పాటు డిసెంబర్ 24న మా బావ మనోభావాలు పాటను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఈ పాటను సంధ్య 35 ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ పాట విడుదలకు గాను ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన బాలకృష్ణ మరియు శృతిహాసన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య ఆయన లుక్కుతో అందరినీ ఆశ్చర్య పరుస్తాడు అన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్యకి చెల్లెలి పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది అని ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని ఈ సినిమాలో

 ఆమె నటించిన పాత్ర కచ్చితంగా అందరినీ ఏడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సన్నివేశాలు షూట్ చేసే సమయంలో వరలక్ష్మి నటన చూసి బాలకృష్ణ సైతం కంటతడి పెట్టుకున్నట్లుగా సమాచారం.దాంతో వరలక్ష్మిని బాలయ్య అభినందించాడట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వేలవుతుంది. అదేంటంటే ఈ సినిమా కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన సినిమా కథను తీసుకొని ఈ సినిమాని నిర్మించినట్లుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ చూస్తే అలాగే ఉంది అని అంటూ సెటైర్లు సైతం వేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు అనేకమైన రూమర్లు  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: