త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రియా భవాని శంకర్..!

Divya
ఈమధ్య కాలంలో కోలీవుడ్ , టాలీవుడ్, బాలీవుడ్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. గతంలో లాగా సినిమాకే జీవితాన్ని అంకితం చేయకుండా.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తమ వ్యక్తిగత జీవితంలో సమయాన్ని స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసపెట్టి వివాహాలు చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇదే సంవత్సరంలో వివాహం చేసుకొని తల్లిదండ్రులైన జంటలు కొంతమంది ఉంటే.. ఇదే సంవత్సరంలో వివాహం చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న జంటలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా మరొక కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో తన ప్రియుడు రాజవేల్ ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించడంతో ఇక త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఏడాది మొదట్లోనే ప్రియా భవాని శంకర్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది అని తెలిసి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈమె విషయానికి వస్తే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె.. న్యూస్ రీడర్గా తన కెరియర్ను మొదలుపెట్టి 2014లో సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.  ఆ తర్వాత 2017లో మేయా దమాన్ అనే సినిమా ద్వారా తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన ప్రియా భవాని శంకర్ ఎక్కువగా తమిళ చిత్రాలలోనే నటించింది. అయితే తెలుగులో ఇదే ఏడాది ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం ఇండియన్ 2 లో కూడా అవకాశం దక్కించుకుంది. అంతే కాదు పాతుతల అనే సినిమాతో పాటు అగిలాన్ అనే రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ లు పూర్తి అయిన వెంటనే ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: