బుల్లి పిట్ట: రాయల్ ఎన్ఫీల్డ్ కి పోటీగా మరో హీరో బైక్..!

Divya
భారత మార్కెట్లోకి హీరో మోటార్స్ సరికొత్త బైకులను విడుదల చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుకు పోటీ ఇచ్చేలా xpluse 200t 4v పేరుతో అదిరిపోయి ఒక క్రేజీ బైకును తీసుకు వస్తోంది కస్టమర్లకు. దీని ధర దాదాపుగా రూ.1,25,756 ఎక్స్ షోరూం నుంచి ప్రారంభమవుతోంది. ఈ హీరో బైకును ఆన్ రోడ్..ఆఫ్ రోడ్ కోసం ఉపయోగించుకోవచ్చు. హీరో కంపెనీకి చెందిన ఈ బైక్ మోడల్ రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయాకు పోటీగా విడుదల చేయబోతున్నారు. ఈ బైక్ మూడు కలర్లలో సరికొత్త ఆప్షన్లతో తీసుకురావడం జరుగుతుంది.

కొత్త xpulser 200t 4v 200cc4 వాల్ కూల్డ్ ఇంజన్ ఇది గరిష్టంగా 19.1ps పవర్ ,17.3 గరిష్ట తార్కును ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ పై స్పీడ్ గేర్ బాక్స్ తో లభిస్తుంది. ఇది ముందు 37mm ఫ్రంట్ ఫోర్క్ వెనుక సెవెన్ స్టెప్ అడ్జస్ట్బుల్ మోనో షాక్ కలిగి ఉంటుంది. ఎవరైనా రైడర్ భద్రత కోసం ఈ బైక్ డిస్క్ బ్రేక్లను కలిగి ఉంటుంది.
ఇది నియో రిట్రో స్టైలింగ్, బోల్డ్ గ్రాఫిక్స్ తో వృత్తాకారపు ఎల్ఈడి హెడ్ లాంప్ లు కలిగి ఉన్నది. ఎల్ఈడి పొజిషన్ యాప్లను కూడా కలిగి ఉంది. ట్యూబ్ టైప్ రెడ్ రోపిలియన్ గ్రాఫ్ ని కలిగి ఉంది. ఇక ఇందులో కాల్ అలర్ట్, తరుణ్ బై టర్న్ నావిగేషన్ యుఎస్బి చార్జర్ గేర్ ఇండికేటర్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వంటి పూర్తిగా డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్లు కలవు. మరి ఈ బండి ఏ మేరకు బైక్ లవర్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఇలాంటి బైక్స్ ఎన్నో కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి అయితే ఒక్కొక్కటి ఒక్కో విధమైన టెక్నాలజీతో ముందుకు రావడం మరి ఇలాంటి బైకులు కస్టమర్లకు ఏ విధంగా కంఫర్ట్ ఇస్తాయి కస్టమర్ల మెప్పు పొందుతాయి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: