షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా విడుదలకు సర్వం సిద్ధం.!

Divya
దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన "బేషరమ్ రంగ్" పాట విడుదల చేయగా పూర్తిస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ సినిమా విడుదలైన ఈ పాటలో దీపికా పదుకొనే బికినీ వస్త్రాలు ధరించడమే కాదు మరొక పక్క హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరిచే విధంగా కాషాయపు కుంకుమ రంగులో ఉండే బికినీ ధరించడం ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు సినిమాను బాయ్కాట్ చేయాలి అని .. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఎలా చూస్తారు అంటూ రకరకాలుగా నినాదాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు విశ్వహిందూ పరిషత్ కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని ఈ సినిమా పాట మార్చివేయాలని లేకపోతే సినిమా విడుదల కాదు అని కూడా స్పష్టం చేశారు.
ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకులు ఈ సినిమా నుంచి ఈ పాటను తొలగిస్తారా లేక అలాగే ఉంచుతారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మరోపక్క మేకర్ సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత షారుఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమా విడుదల అవబోతోంది భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. సంక్రాంతికి పలు సినిమాలు విడుదలైన తర్వాత ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి షారుఖ్ ఖాన్ సౌత్ ఇండియాలో సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేశాడు.

సినిమా ప్రమోషన్స్ కోసం షారుఖ్ ఖాన్ తో పాటు జాన్ అబ్రహం అలాగే దీపిక పదుకొనే హాజరు కాబోతున్నారు.  ముఖ్యంగా సౌత్ ఇండియాలో తమిళనాడు , కర్ణాటక తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టనున్నారు.  మరి ఈ సినిమా ఏ విధంగా విజయాన్ని సాధిస్తుంది.. ఉన్న అడ్డంకులను తప్పించుకుంటుందా.. లేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మొత్తానికైతే ఈ సినిమా విడుదల అవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: