సినిమాలకు పూర్తిగా దూరం అవుతున్న' సమంత '.... నిజమేనా ..??

murali krishna
సమంత విజయ్ నటించనున్న ఖుషి సినిమా పరిస్థితి ఎటూ తేలకుండాపోయింది. టక్ జగదీష్‌ సినిమా తరువాత శివ నిర్వాణ ఎంతో గ్రాండ్ ‌గా ఈ సినిమాను ప్రారంభించాడు. టక్ జగదీష్ సినిమా తో పోయిన పరువంతా కూడా ఖుషీ సినిమా తో తిరిగి తెచ్చుకోవాలని భావించాడు. ఇక విజయ్ సైతం లైగర్ సినిమా దెబ్బను ఖుషీతో తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ వీరందరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. సమంత కు మయోసైటిస్ రావడంతో అంతా మారిపోయింది.
సమంత విజయ్ కాంబోలో కాశ్మీర్‌లో ఓ లాంగ్ షెడ్యూల్ ‌ను షూట్ చేశాడు శివ నిర్వాణ. అయితే ఆ తరువాతే సమంత కు ఈ వ్యాధి బయటపడింది. కొన్ని రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమంతకు వ్యాధి అంతకంతకూ పెరుగు తూనే పోయింది. దీంతో సమంత గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది. బెడ్డు మీద ఉండ గానే యశోద సినిమా ను ప్రమోట్ చేసింది. అతి కష్టం మీద బయటకు వచ్చిన కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది.
అయితే సమంత ఇప్పుడు కోలుకునేలా కనిపించడం లేదు. వైద్యులు ఇంకా విశ్రాంతి తీసుకో వాలని చెబుతూనే ఉన్నారట. దీంతో సమంత ఓ నిర్ణయం తీసుకుందట. ఇకపై సినిమా లను ఒప్పుకోకూడదని, ఆల్రెడీ ఒప్పుకున్న ఖుషి సినిమా ను మాత్రం ఎలాగోలా నెక్ట్స్ మంత్ పూర్తి చేయాలని అనుకుంటోందట.
ఆమె ఖాతాలో కొన్ని బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్‌లు కూడా వచ్చి పడ్డాయి. కానీ వాటికి వేరే వాళ్లని చూసుకోమ్మని సమంత టీం హింట్ ఇస్తోందట. ఇకపై కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేది లేదని, కొంత కాలం సినిమా లకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసు కోవాలని సమంత భావిస్తోందట. మరి సమంతకు ఆ వ్యాధి ఎప్పుడు తగ్గుతుందో.. మళ్లీ ఎప్పుడు సినిమా లతో బిజీగా అవు తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: