ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత...!!
సమంత(Samantha).. సౌత్ స్టార్ హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్కి చేరువలో ఉంది. ఇప్పటికే `యశోద` సినిమాతో సత్తా చాటింది. మున్ముందు మరిన్ని పాన్ ఇండియా సినిమాలతో రాబోతుంది. అయితే గత కొంత కాలంగా ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకోలేదు. ఇంకా ఆ వ్యాధితోనే బాధపడుతుందట. పూర్తిగా నయం కావడానికి కొంత టైమ్ పడుతుందని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో `యశోద` ప్రమోషన్లో ఓ సారి ప్రత్యేక చిట్చాట్లో పాల్గొన్న సమంత.. ఆ తర్వాత మరోసారి బయటకొచ్చింది. ఆమె కార్యక్రమంలో పాల్గొని తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు కోపం వస్తే జిమ్లో అధికంగా వర్కౌట్స్ చేస్తుందట. ఇష్టానుసారంగా ఎక్సర్ సైజ్లు చేస్తానని, వెంటనే కోపం తగ్గిపోతుందని చెప్పింది సమంత.
ఇంకా సమంత చెబుతూ, తాను డబ్బుకి, పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడనని తెలిపింది. తనకు డబ్బు కంటే నటనే ముఖ్యమని చెప్పింది. తాను చేసే ప్రతి పాత్రని ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే అందులో ఎలాంటి సంతోషంగానీ, ప్రయోజనం గానీ ఉందన్నారు. తనకు తానే పెద్ద విమర్శకురాలినని, మన మిస్టేక్స్ ని, పొరపాట్లని తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని చెప్పారు. తాను చేసిన పని తానే చెక్ చేసుకుంటానని చెప్పింది.
కాలం కలిసి వస్తేనే ఏదైనా జరుగుతుందని చెప్పింది. ఆ సమయంలో బాధపడకుండా, ఆ ఆలోచనలు పక్కన పెట్టి నిద్రపోతానని చెప్పింది సామ్. మనకు నచ్చినట్టుగా జీవించాలని, భూమ్మీదకు వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతర సంతోషపెట్టడానికో కాదని, మనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని, అప్పుడే మనకు కావాల్సింది వెతుక్కుంటూ వస్తుందని చెప్పింది సమంత. స్టార్ హీరోయిన్ లైఫ్కి సంబంధించిన ఫిలాసఫీ పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చెప్పినదాన్ని అంగీకరిస్తున్నారు.
సమంత ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యింది. ఆమె కోసం `ఖుషి` టీమ్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ `శాకుంతలం` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే బాలీవుడ్ మూవీస్ కి కూడా కమిట్ అయ్యింది సమంత. అవన్నీ సమంత కోసం వెయిటింగ్లో ఉన్నాయి.