SSMB -29 తరువాత రాజమౌళి ఆ హీరోలతో మల్టీస్టారర్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి కొత్త ప్రాజెక్టు ప్రకటన చేయరు. కనీసం వివరాల గురించి కూడా ఎక్కడ లీక్ కాకుండా పలు జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఉంటారు. ఊహకి కూడా రానంత విధంగా తన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో రాజమౌళి లో కూడా పలు మార్పులు కనిపిస్తున్నాయి. ఒక సినిమా సెట్ లో ఉండాలని మరొక సినిమాను ప్రకటించి ప్రేక్షకులను చాలా ఎక్సైటింగ్ గా చేస్తూ ఉన్నారు.

RRR సినిమా సెట్ లో ఉండంగానే తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో ఉంటుందని ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగింది రాజమౌళి.RRR సినిమా సరిగ్గా విడుదలకు ముందు ఈ ప్రాజెక్టుని కన్ఫర్మ్ చేయడం జరిగింది.ఇది నిజంగా అభిమానులకు ఒక షాకింగ్ విషయమై చెప్పవచ్చు. బాహుబలి వరకు తన కొత్త ప్రాజెక్టును ప్రకటించడం విషయంలో రాజమౌళి చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమా తర్వాత మరే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

మహేష్ బాబుతో SSMB -29 సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి పాన్ వరల్డ్ స్టార్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఎన్టీఆర్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నట్లు సమాచారం. దీన్ని పాన్ వరల్డ్ గా మలిచి ప్రపంచంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా పేరు సంపాదించాలని భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ తో హాలీవుడ్ రేంజ్ లో పాన్ వరల్డ్ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి ముఖ్యంగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో భారీ యాక్సిడెంట్. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది ఆ తర్వాత ఎప్పుడు పూర్తి చేసి ఈ సినిమాని విడుదల చేస్తారు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: