కంటి చూపు కోల్పోయిన రష్మీక మందన..ఎందుకు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ  ఇండస్ట్రీకి ఎంట్రీ  ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్ గా  మంచి గుర్తింపును సంపాదించుకుంది రష్మిక మందన. కన్నడలో కాంతార హీరో మరియు డైరెక్టర్ రిషబ్  దర్శకత్వంలో వచ్చిన కిరిక్ పార్టీ అనే సినిమాతో వెండి తెరకి పరిచయమైంది ఈమె. దాని తరువాత తెలుగులో నాగ శౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ సినిమా అనంతరం ఆమె చేసిన గీత గోవిందం అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. దాని తర్వాత ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది.

 అనంతరం ఈమె తెలుగు, హిందీ, తమిళం ,కన్నడ అని ప్రతి ఇండస్ట్రీలో  స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. చూస్తూ చూస్తూనే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన .అయితే గత ఏడాది ఈమె హీరోయిన్గా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను కూడా అందుకుంది. ఇక ఆ సినిమా అనంతరం ఈమెకి బాలీవుడ్ లో కూడా ఆఫర్లు రావడం జరిగింది. సందీప్ వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న అనిమల్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దాని తర్వాత అమితాబచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఈమె సిద్ధార్థ మల్హోత్రా తో కలిసి నటించిన మిషన్ మజ్ను సినిమా నేరుగా ఓటీడీలో విడుదలైంది. లవ్ మరియు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తేరకెక్కిన నేపథ్యంలో ఆ సినిమాలో రష్మిక అందరు అలిగా నటిస్తోంది. ఇక కంటి చూపు కోల్పోయిన అమ్మాయిగా ఆ సినిమాలో నటిస్తోందట రష్మిక. అందుకోసం రష్మిక మందన చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సినిమానే కాకుండా ఈమె తమిళంలో దళపతి విజయ్ తో కలిసి వారితో సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా తెలుగులో వారసుడు గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: