చిరు, బాలయ్యతో జతకట్టిన శృతిహాసన్.. 2001 సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ.  ఒకప్పుడు స్టార్ హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో హవా నడిపించిన  ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక వీరిద్దరు సినిమాలు ఒక్కరోజు తేడాతో లేదా ఒకే రోజు విడుదలవడం కూడా చాలా సార్లు జరిగింది అని చెప్పాలి. ఇక ఇలా ఎన్నోసార్లు పోటీ పడిన సమయంలో ఒకసారి బాలయ్య పైచేయి సాధిస్తే మరోసారి మెగాస్టార్ చిరంజీవి హిట్టు కొట్టడం జరిగింది.

 ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఇక ఇద్దరు సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తుంది. ఒకవైపు బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన అంటే బాలయ్య సినిమా విడుదలైన ఒక్క రోజు తర్వాత ఇక థియేటర్లలో విడుదల కాబోతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపూతుంది చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ హీరోల సరసన నటిస్తుంది శృతిహాసన్ కావడం గమనార్హం.

 అంతే కాదండోయ్ ఇక రెండు సినిమాలకు కూడా నిర్మాత ఒక్కరే కావడం గమనార్హం.  గతంలో కూడా సేమ్ ఇవే రిపీట్ అయిన సందర్భం ఒకసారి ఉంది. చిరంజీవి హీరోగా మృగరాజు.. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమాలు 2001 సంవత్సరం జనవరి 11న విడుదలయ్యాయి.  ఇక అప్పుడు రెండు సినిమాల్లో కూడా సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.  అయితే అప్పుడు మృగరాజు పెద్ద ఫ్లాప్ కాగా.. నరసింహనాయుడు మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాల్లో సేమ్ హీరోయిన్ కావడం..  ఇక సంక్రాంతి బరిలోనే రెండు సినిమాలు ఉండడంతో 2001 సెంటిమెంట్ రిపీట్ అవుతుంది ఏమో అని మెగా అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: