ఘనంగా 18 పేజీస్ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

Divya
కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మరొకసారి జంటగా కలిసిన నటిస్తున్న సినిమా 18 పేజెస్. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ 18 పేజీస్ టీజర్ కి "నన్నయ్య రాసిన" , అలానే "టైం ఇవ్వు పిల్ల " అనే పాటలతో పాటు రీసెంట్గా రిలీజ్ అయిన "ఏడు రంగుల వాన" అనే పాటకి కూడా ఊహించని స్పందన లభించింది.
ముఖ్యంగా సుకుమార్ ఈ సినిమాకు కథను అందించాడు.  ఆయన శిష్యుడు కుమార్ 21ఎఫ్ సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం. ఇకపోతే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని కంటెంట్ రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది.. ఈ తరుణంలోనే ఈ చిత్రం యొక్క థియేటర్ ట్రైలర్ ను 17వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఒక క్రేజీ వీడియోతో ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు అనుపమ మరియు నిఖిల్.
నిజానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమాను థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాతో పాటు 18 పేజెస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజరు, పాటలు,  పోస్టర్లు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నేపథ్యంలో ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్టు కొడితే ఈ జంట లక్కీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: