మరికొన్ని రోజుల్లోనే ఆదర్శకుడితో మూవీ మొదలుపెట్టనున్న విజయ్ దేవరకొండ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం లైగర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పూరి జగన్నాథ్  దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గ నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఖుషి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. శివ నర్వణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఖుషి మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి మూవీ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జెర్సీ మూవీ తో ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో విజయ్ దేవరకొండ నటించ బోతున్నట్లు సమాచారం.

కొన్ని రోజుల క్రితమే గౌతమ్ తిన్ననురి , విజయ్ దేవరకొండ కు ఒక కథ వినిపించగా ,  ఆ కథ బాగా నచ్చిన విజయ్ దేవరకొండ వెంటనే ఈ దర్శకుడి మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు ఉన్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: