బాలీవుడ్ లోకి వెళ్లబోతున్న "డీజే టిల్లు" మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి ఈ సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో డీజే టిల్లు మూవీ ఒకటి. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించ గా నేహా శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను కొల్ల గొట్టింది. ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్ , డైలాగ్ డెలివరీ , డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కూడా యూత్ ను ఆకట్టు కునే విధంగా ఉండడం తో ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇలా డిజె టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడం తో ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీ కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని ప్రకటించాడు.

మరి కొన్ని రోజుల్లోనే టిల్లు స్క్వేర్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డీజే టిల్లు మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... డిజె టిల్లు మూవీ ని హిందీ లో రీమిక్ చేయడానికి కొన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ,  అందులో భాగంగా ఈ మూవీ రీమేక్ హక్కులను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే అన్ని కుదిరితే మరి కొన్ని రోజుల్లోనే ఏదో ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ డిజె టిల్లు మూవీ యొక్క రీమేక్ హక్కులను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: