పుష్ప రాజ్.. అవతార్ 2 కి హ్యాండ్ ఇచ్చినట్టేనా..?

Divya
సుకుమార్ దర్శకుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి భాగం పుష్ప ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు . సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ఇంకా రెండవ భాగం షూటింగు ప్రారంభం కాకపోవడం గమనార్హం. అసలైతే ఇదే నెలలోనే మొదలుపెట్టాలని అనుకున్నారు కానీ ఎందుకో మళ్లీ వెనుకడుగు వేశారు. అలాగే పుష్ప 2 కి సంబంధించిన అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యలో అల్లు అర్జున్ అభిమానులైతే ఏకంగా గీత ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నిరసనలు కూడా తెలియజేశారు.. అంతేకాదు వెంటనే పుష్ప 2 కి సంబంధించి అప్డేట్ ఇవ్వాలని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేశారు.

అయితే ఈ విషయంపై గీతా ఆర్ట్స్ పెద్దగా రియాక్ట్ అవలేదు. కానీ ఒక స్పెషల్ టీజర్ మాత్రం విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. నిజానికి గీత ఆర్ట్స్ కూడా అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా రచించింది. ముఖ్యంగా హాలీవుడ్ మూవీ అవతార్ 2 :ది వే ఆఫ్ వాటర్ సినిమా రిలీజ్ తో పాటు థియేటర్లలో పుష్ప 2 గ్లింప్ కూడా విడుదల చేయాలని గీతా ఆర్ట్స్ సంస్థ ఆలోచించింది.  కానీ అందుకు తగ్గట్టుగా ఇప్పుడు గ్లింప్స్ అయితే రెడీ కాలేదు. ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు పుష్ప మొదటి భాగాన్ని రష్యాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పనుల్లోనే బిజీగా ఉండడం వల్ల అనుకున్న సమయానికి పుష్ప 2 అప్డేట్ రెడీ చేయలేకపోయారు.
అందుకే ముందుగానే గీత ఆర్ట్స్ మాత్రం ఎగ్జిబిటర్స్ అందరితో ఒక డీల్ అయితే సెట్ చేసుకుంది. కానీ ఇప్పుడు అప్డేట్ లేకపోవడంతో ఆస్థానంలో అదే సంస్థ నుంచి వస్తున్న 18 పేజెస్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు థియేటర్లలో అవతార్ 2 సినిమాతో పాటు నిఖిల్ సిద్ధార్థ నటించిన 18 పేజీస్ సినిమా ట్రైలర్ కూడా సందడి చేయబోతోంది . ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: