డీజే టిల్లు-2 సినిమాకి హీరోయిన్ కష్టాలు..!!

Divya
ఈ ఏడాది టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించిన చిత్రాలలో డిజె టిల్లు చిత్రం కూడా ఒకటీ. సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. హీరోయిన్గా నేహా శెట్టి నటించింది. ఈ చిత్రంలోని డైలాగులు నటన ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి తెగ ఇష్టపడ్డారు. మరి అలాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ విమల్ కృష్ణ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కూడా నిర్మాతలు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి సీక్వెల్ లో సరికొత్త డైరెక్టర్ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్గా నేహా శర్మ కాకుండా మరొక హీరోయిన్ ని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈ చిత్రంపై ఎక్కువగా గందరగోళం నెలకొంది. రోజు కొక హీరోయిన్ పేరు తెరమీదికి వినిపిస్తూనే ఉంది.

ముందుగా నేహా శర్మ కి బదులుగా శ్రీ లీలను అనుకోగా .. కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడంతో అనుపమా అని అనుకున్నారు.. కానీ ఆమె కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగా అడుగుడంతో ఆమెను కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత మడోనా సెబాస్టియన్ పేరు కూడా వినిపించింది అయితే.. ఈమెకు స్కిన్ టెస్ట్ చేయాగా అందులో ఆ పాత్రకు తగ్గట్టుగా సరిపోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో డిజె టిల్లు -2 సినిమాకి హీరోయిన్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.రీసెంట్ గా హిట్ -2 సినిమాతో సక్సెస్ సాధించిన మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: