మెగా ఫ్యాన్స్ కు షాక్..సంక్రాంతి నుంచి చిరంజీవి మూవీ అవుట్..

Satvika
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాధర్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..గత రెండు నెలల నుంచి టాలీవుడ్‌లో సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండదని ఒక్కటే చర్చలు కంటిన్యూ అవుతున్నాయి..ఇకపోతే టాలీవుడ్‌లోనే ఇద్దరు బిగ్ హీరోలు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు ఫిక్స్ అయ్యాయి. పైగా రెండూ ఒకే బ్యానర్లో తెరకెక్కిన సినిమాలే. ఇద్దరి సినిమాలు సంక్రాంతికి దశాబ్దాల నుంచి పోటీ పడుతూ బాక్సాఫీస్ సమరాన్ని హీటెక్కిస్తున్నవే.



మరోసారి సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల మధ్య అదిరిపోయే ఫైట్ నడుస్తుందనే అందరూ అంచనాలతో ఉన్నారు. ఓ వైపు థియేటర్ల అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా స్పీడ్‌గానే నడుస్తున్నాయి. ఇక రెండు సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ కూడా వచ్చేసి యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడు కూడా రిలీజ్ అవుతుండడం, ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు కూడా మన తెలుగోడు అయిన వంశీ పైడిపల్లి కావడంతో ట్రయాంగిల్ ఫైట్ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుందని అందరూ అనుకున్నారు.


వీరయ్యకు పోటీగా సంక్రాంతి రేసులో ఉన్న వారసుడు జనవరి 12న ఫిక్స్ అయినట్టే. వీరసింహారెడ్డిని కూడా అదే డేట్‌ను వదులుతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించేశారు. అయితే వీరయ్యను 13న రిలీజ్ చేస్తారని ముందు నుంచి అందరూ అనుకుంటూ వస్తున్నారు. వారసుడు, వీరసింహారెడ్డి రెండు సినిమాల రిలీజ్ డేట్లు వచ్చినా వీరయ్య రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జనలు జరుగుతుండడం చాలా సందేహాలకు తావిచ్చింది.



అయితే ఇప్పుడు ఆ అనుమానాలే నిజం అవుతున్నాయి. వాల్తేరు వీరయ్యను సంక్రాంతి రేసు నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను సంక్రాంతి తర్వాత సోలోగా రిలీజ్ చేయాలని మేకర్స్ దాదాపు నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాల గట్టి పోటీకి తోడు. దిల్ రాజు వారసుడు కోసం మెయిన్ థియేటర్లు బ్లాక్ చేయడం.. పైగా వాల్తేరు వీరయ్యకు ఎక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో పాటు టార్గెట్ పెద్దగా ఉండడంతో మేకర్స్ రిస్క్ చేయట్లేదు.. దాంతో సినిమాను వాయిదా వేశారు..మెల్లగా విడుదల చేయాలని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: