బాబాయ్ సినిమాకు అబ్బాయి వాయిస్ ఓవర్...!!

murali krishna
అఖండ' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి రాబోతున్న భారీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వీరసింహారెడ్డి'. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 'క్రాక్' దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది..టాలీవుడ్ బడా సంస్థల్లో ఒకటైన 'మైత్రి మూవీ మేకర్స్' బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అయ్యింది.
దానికి మంచి టాక్ కూడా వచ్చింది. గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ అయితే లభించింది. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. కచ్చితంగా ఈ సినిమా నందమూరి అభిమానులనే కాకుండా మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుందని.. చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తుందట.ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే.. 'వీరసింహారెడ్డి' మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వబోతున్నాడట.
15 నిమిషాల పాటు ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ… ఇది నిజమైతే 'వీరసింహారెడ్డి' కి డబుల్ అడ్వాంటేజ్ అనే చెప్పవచ్చు.. ముఖ్యంగా నందమూరి అభిమానులకు పెద్ద పండుగ లాంటి వార్త అనే చెప్పవచ్చు.. ఈ బాబాయ్ అబ్బాయ్ లకు తిరుగులేని మాస్ ఇమేజ్ అయితే ఉంది. పైగా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్టు కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ ఉంటారు.
వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టె ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా బాలయ్య లాంటి సీనియర్ హీరో సినిమాకి ఇప్పటి స్టార్ హీరో పుషింగ్ ఉంటే.. మంచి రిజల్ట్ అందుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. 'అఖండ' ప్రీ రిలీజ్ కు బన్నీ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్ వంటివి ఇస్తే ఇంకా ప్లస్ అయ్యే ఛాన్స్ లు కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: