"వాల్తేరు వీరయ్య" లో రెండు బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో ఓ క్రేజీ సాంగ్ ను రెడీ చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ సంవత్సరం మొదట ఆచార్య మూవీ తో ప్రేక్షకులను మెగాస్టార్ చిరంజీవి పలకరించాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. పూజా హెగ్డే ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత తాజాగా చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తార ముఖ్య పాత్రలలో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ లో రవితేజ పాత్ర దాదాపు 45 నిమిషాల నిడివి తో ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే రవితేజ పై ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలను మరియు ఒక పాటను కూడా చిత్రికరించ బోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ ఇద్దరు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకోసం దేవి శ్రీ ప్రసాద్ వీరిద్దరి కెరియర్ లో సూపర్ హిట్ గ నిలిచినటువంటి రెండు పాటలను కలిపి ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: