మహేష్ నయా లుక్ ఫ్యాన్స్ ఫిదా..సూపర్..

Satvika
తెలుగు స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు లుక్ నెట్టింట ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ వస్తుంది.సూపర్ స్టార్ స్టైలీష్ లుక్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రిన్స్ నయా లుక్స్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. తన ప్రతి కు మహేష్ లుక్ మారుస్తుంటారు. సర్కారు వారి పాట తో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తాజాగా నెట్టింట మహేష్ కు సంబంధించిన ఓ లేటేస్ట్ ఫోటో హల్చల్ చేస్తుంది.

ఇటీవల తన తండ్రి కృష్ణ మరణించడంతో విరామం తీసుకున్నారు మహేశ్. తండ్రి అంత్యక్రియలు, చిన్న కర్మ, తండ్రి అస్థికలు విజయవాడ వద్ద కృష్ణా నదిలో కలపడం, పెద్దకర్మ తదితర కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. బ్యాక్ టు వర్క్ అంటూ ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్టింట ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. అంతేకాదు తన లేటెస్ట్ పిక్ ను కూడా మహేశ్ బాబు పంచుకున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సురేశ్ నటరాజన్ తీసిన ఆ ఫొటోలో మహేశ్ బాబు షార్ప్ లుక్స్ తో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే మహేష్ ఓ కంపెనీకి చెందిన యాడ్ లో కనిపిస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రిన్స్ లేటేస్ట్ లుక్ చూసి పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. మహేష్ తిరిగి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది..ఆ సినిమా అనుకున్నప్పుటి నుంచి ఏదొక అడ్డంకులు వస్తూనే వున్నాయి.. ఈసారైన సినిమా షూటింగ్ పూర్తవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: