HBD: రాశి ఖన్నా గురించి తెలియని అతి కొద్ది రహస్యాలు ఇవే..!

Divya
1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2013లో విడుదలైన హింది చిత్రం "మద్రాస్ కెఫె" లో భారత ఇంటలిజెన్స్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబీ సింగ్ పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు ఈ పాత్రలో నటించడానికి నటనలో శిక్షణ కూడా తీసుకొని మరి ఈ సినిమాలో నటించింది. ఢిల్లీలో జన్మించిన రాశి కన్నా డిగ్రీ వరకు తన విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన "ఊహలు గుసగుసలాడే" చిత్రం ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యింది.  ఈ సినిమాలో ఈమెకు జోడిగా యంగ్ హీరో నాగ శౌర్య నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మనం సినిమాలో అతిథి పాత్రలో నటించి మెప్పించిన రాశిఖన్నా జోరు,  జిల్ , బెంగాల్ టైగర్,  శివం , సుప్రీం, హైపర్,  జై లవకుశ,  రాజా ది గ్రేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2017 మలయాళంలో విలన్ అనే సినిమాలో హర్షిత చోప్రా అనే పాత్రలో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత తమిళంలో సుమారుగా ఐదు పైగా చిత్రాలలో నటించింది.

ఇటీవల పక్కా కమర్షియల్ , థాంక్యూ,  తిరు,  సర్దార్ వంటి చిత్రాలలో నటించిన రాశి ఖన్నా మిగతా మూడు సినిమాలతో పెద్దగా గుర్తింపు లభించలేదు.  కానీ సర్దార్ సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. కేవలం తెలుగు, తమిళ్ , మలయాళం చిత్రాలలోనే కాదు బుల్లితెరపై కూడా అలరించడానికి పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది . ప్పటికి మొదటిసారి రుద్ర : ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ వంటి తొలి వెబ్ సిరీస్ లో డాక్టర్ ఆలియా చోక్స్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.  ప్రస్తుతం రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే లతో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.  అయితే ఈ సీరిస్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: