'మట్టి కుస్తీ ' ఆకట్టుకుంటుంది అంటున్న ఆ స్టార్...!!
కథానాయకుడు, నిర్మాత విష్ణు విశాల్ మాట్లాడుతూ ''ఈ సినిమా చేసిన నేను చాలా అదృష్టవంతుడిని. కల నిజమైన భావన కలుగు తోంది. రవితేజ మంచి మనసున్న వ్యక్తి. తొలిసారి నన్ను నమ్మి ప్రోత్సహించారు.
తమిళం లో నేను ఈ స్థాయికి రావడానికి 13 ఏళ్లు పట్టింది. తెలుగు లో ఇప్పుడు రవితేజ గారి అండ, నా భార్య జ్వాల ప్రోత్సహం ఉంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టే ఈ సినిమా అందరి నీ మెప్పిస్తుంది'' అన్నారు. రవితేజ మాట్లాడుతూ ''క్రీడా నేపథ్యమే కాదు...
ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు కలగలిసిన సినిమా ఇది. దర్శకుడు చెల్లా అయ్యావు మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి. తను కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నా. మేం తెలుగు, తమిళం లో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం.
అందం, ప్రతిభ కలిపితే ఐశ్వర్య లక్ష్మి. విష్ణు విశాల్ పాజిటివ్ ఆలోచనలున్న వ్యక్తి. ఈ సినిమా చాలా బాగుంటుంది. అందరూ ఆస్వాదిస్తార''న్నారు. ''కుటుంబం తో కలిసి థియేటర్లలో చూసే సినిమా ఇది'' అన్నారు ఐశ్వర్య లక్ష్మి. వేడుకలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మితో కలిసి రవితేజ డాన్స్ చేశారు. కార్యక్రమంలో సుధీర్వర్మ, వంశీ, అజయ్, కృష్ణచైతన్య, గుత్తా జ్వాల, గుత్తా క్రాంతి, గుత్తా ఏలన్, జస్టిన్ ప్రభాకర్, రిచర్డ్, నాదన్, రాకేందు మౌళి, శ్వేత, వింధ్య, స్రవంతి, దురై తదితరులు పాల్గొన్నారు.