"వరిసు" మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటు వంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "రంజితమే" అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదల అయిన నిమిషాల్లోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ ను సాధిస్తూ , ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ ను కూడా విడుదల చేయడానికి సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ నుండి రెండవ సాంగ్ ను డిసెంబర్ 4 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి ష్ణు పాడినట్లు తెలుస్తుంది. అలాగే ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు సమాచారం. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: