మహేష్ కన్నా ఎక్కువ తీసుకుంటున్న ఎన్.టి.ఆర్..!

shami
సినిమాలతో పోటీ పడుతున్న మహేష్, ఎన్.టి.ఆర్ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలతో కూడా పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సౌత్ లో ఏ హీరోకి లేని బ్రాండ్స్ అన్ని తన ఖాతా లో వేసుకున్నాడు మహేష్. ఇప్పుడు మహేష్ దారిలోనే తారక్ కూడా వరుస యాడ్స్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఎన్.టి.ఆర్ ఓ వాణిజ్య ప్రకటనతో ముందుకొచ్చాడు. లిసియస్ అంటూ ఓ ఆన్ లైన్ ఫిష్ సేల్ బిజినెస్ కి ఎన్.టి.ఆర్ తన సపోర్ట్ అందిస్తున్నారు. లిసియస్ యాడ్ కోసం ఎన్.టి.ఆర్ కోర్ట్ సీన్ లో అదరగొట్టాడు.
అది చూసి తారక్ టెంపర్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇదిలాఉంటే ఈ లిసియస్ యాడ్ కోసం ఎన్.టి.ఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుని. మాములుగా అయితే ఒక ప్రకటనకు తీసుకునే యాడ్ కన్నా డబుల్ ప్రైజ్ ఈ లిసియస్ యాడ్ కోసం తీసుకున్నాడట ఎన్.టి.ఆర్. అది కూడా మహేష్ బాబు తీసుకునే పేమెంట్ కన్నా కోటిన్నర దాకా ఎక్కువని తెలుస్తుంది. మహేష్ కూడా వాణిజ్య ప్రకటనలో తన సత్తా చాటుతూ వస్తున్నాడు.
మహేష్ ఖాతాలో అరడజనుకు పైగా బ్రాండ్స్ ఉన్నాయి. ఎన్.టి.ఆర్ అంత రేంజ్ లో కాకపోయినా తన కోసం వచ్చిన వారిని కాదనకుండా చేస్తున్నాడు. మొన్నటిదాకా సెలెక్ట్ మొబైల్స్ య్ప్రకటనలు చేసిన తారక్ ఆ అగ్రిమెంట్ పూర్తైందనుకుంటా అందుకే ఈమధ్య పెద్దగా సందడి చేయట్లేదు. ఏది ఏమైనా ఎన్.టి.ఆర్ చేసిన ఈ కొత్త యాడ్ మాత్రం ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఎన్.టి.ఆర్ తో ఈ యాడ్ లో కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా కనిపించారు. ఇక త్వరలో ఎన్.టి.ఆర్ 30వ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: