నయన్ సినిమా విషయంలో ఆ నిర్ణయం కరెక్టేనా.. ఏమిటంటే..!!

Divya
హీరోయిన్గా నయనతార తెలుగు ఇండస్ట్రీలో.. అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ ఒక్క సినిమాతో బాలీవుడ్ అంతా బాగా పాపులర్ అవుతోంది నయనతార. అయితే ఇప్పుడు హీరోయిన్ గా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.. ఇప్పటికే కొన్ని హార్రర్ చిత్రాలలో కూడా నటించింది నయనతార. మొదట చంద్రముఖి సినిమాతో ఫేమస్ అయిన నయనతార ఆ రకమైన సక్సెస్ కోసం చాలాకాలంగా వెయిట్ చేస్తోంది.
అటు తర్వాత చాలా సినిమాలు వచ్చిన పర్వాలేదు అనిపించుకుంది.  నయనతార త్వరలో విడుదల కాబోతున్న కనెక్ట్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకుల్ని సీటులో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేయాలంటే రిలాక్స్ టైం ఇవ్వకూడదని మేకర్స్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కేవలం 95 నిమిషాల నిడివితో రిలీజ్ చేయబోతున్నారు అంటే గంటన్నర వ్యవధి గల ఈ హర్రర్ చిత్రం పై మంచి బజ్ ఏర్పడుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు ఈ సినిమాకు పాజిటివ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి.

ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో టెక్నికల్ గా ఈ సినిమా హైలైట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది అయితే.. 95 నిమిషాలు సినిమాని ఇంకా ట్రిమ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని నయనతార దృష్టికి తీసుకువెళ్లాగా అలా చేస్తే నిడివి మరీ తగ్గిపోతుందని తెలియజేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని దర్శకుడికి వదిలేసినట్లు సమాచారం.  దీంతో ఈ సినిమా స్టార్ట్ కాకముందే పాప్ కార్న్ వంటివి ముందే తీసుకొని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చే విధంగా చూడాలని ప్లాన్ చేస్తున్నారు దీంతో ఇంటర్వ్యూలు లేకుండా ఈ సినిమా అని థియేటర్లో ప్రసరించే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: