సమ్మర్ ని టార్గెట్ చేసుకున్న క్రిష్ జాగర్లమూడి..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి క్రిష్ జాగర్లమూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ , అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గమ్యం మూవీ తో దర్శకుడి గా కెరీర్ ను మొదలు పెట్టిన క్రిష్ జాగర్లమూడి మొదటి మూవీ తోనే ఇటు ప్రేక్షకుల నుండి , అతు విమర్శకులను నుండి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత వేదం , కృష్ణం వందే జగద్గురుం , కంచె ,  గౌతమీపుత్ర శాతకర్ణి , ఎన్టీఆర్ కథానాయకుడు ,  ఎన్టీఆర్ మహానాయకుడు వంటి పలు తెలుగు మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రిష్ జాగర్లముడి ఇద్దరికీ కూడా ఇదే తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ లో చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.  దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ ని 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు , అందుకు అనుగుణంగా ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ లో తేరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: