ఆ కారణంతో హోల్డ్ లో ఉండిపోయిన విజయ్... గౌతమ్ మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన గౌతమ్ తిన్ననూరి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ రావా మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ దర్శకుడు జెర్సీ మూవీ తో ప్రేక్షకుల నుండి , విమర్శకు నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. అలాగే జెర్సీ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ఈ మూవీ ని ఇదే పేరుతో హిందీ లో షాహిద్ కపూర్ హీరో గా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన హిందీ జెర్సీ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

హిందీ జెర్సీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి హిందీ జెర్సీ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కొన్ని అనివార్య కారణాల వల్ల గౌతమ్ తిన్ననూరి మూవీ నుండి తప్పుకోవడంతో ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ తో మూవీ చేయాలి అని ప్లాన్ చేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కూడా హోల్డ్ లో పడిపోయినట్లు తెలుస్తోంది.

అందుకు కారణం గౌతమ్ తిన్ననూరి రాసుకున్న కథను తెరకెక్కించడానికి దాదాపు 100 కోట్ల బడ్జెట్ అవసరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ రేంజ్ బడ్జెట్ అనడంతో ఈ మూవీ హోల్డ్ లో పడినట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , సమంత హీరోయిన్ గా శివ నిర్మాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: