రాధిక తో ఒక ఆటాడుకున్న బాలకృష్ణ !

Seetha Sailaja
‘అన్ ష్టాపబుల్’ షోలో బాలకృష్ణ ను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. బాలయ్యలో కోపం ఆవేశంతో పాటు అంత హాస్యచతురత ఉందా అని చాలామంది షాక్ అవుతున్నారు. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోకు సంబంధించిన సీజన్ 2కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రొమోలో ఒకనాటి టాప్ హీరోయిన్ రాధిక తో బాలయ్య ఎలా ఆటాడుకున్నాడు అన్న విషయాన్ని ఆశక్తి పెంచే విధంగా ఆ ప్రోమో ను కట్ చేసారు.

బాలకృష్ణ రాధిక కార్నర్ చేయాలని ఒక తుంటరి ప్రశ్న అడిగాడు. చిరంజీవిలో నచ్చనది తనలో నచ్చినది ఏమిటో చెప్పమని బాలయ్య అడిగినప్పుడు రాధిక కొంత షాక్ అయినట్లు కనిపిస్తోంది. అయితే తెలివైన రాధిక ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పింది అన్న ఆశక్తిని క్రియేట్ చేసేలా ఆ ప్రోమో కనిపిస్తోంది. ఇదే ఎపిసోడ్ లో బాలకృష్ణ ఒకనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సురేష్ రెడ్డి లను ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది.


సురేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ అయినప్పటికీ లెక్కచేయకుండా తనను ఆట పట్టించడానికి అర్థరాత్రి బాలయ్య తనకు మారుగొంతుతో ఫోన్ చేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నారు. అంతేకాదు బాలయ్యతో తాను కాలేజీలో కలిసి చదువుకున్న రోజులలో క్రికెట్ ఆడిన విషయాలను కూడ సురేష్ రెడ్డి గుర్తుకు చేసుకున్నాడు. వాస్తవానికి ఆహా లో ఈ షోను చూస్తున్నవారు బాలయ్య జూనియర్ కళ్యాణ్ రామ్ లతో ఇంటర్వ్యూ చేయాలని ఆశపడుతున్నారు.

అయితే అలాంటి ప్రయత్నం జరుగుతోందా లేదా అన్న విషయమై క్లారిటీ లేదు. అంతేకాదు బాలయ్య చిరంజీవిని కార్నర్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని చాలామంది ఆశ పడుతున్నారు. అయితే అది కూడ అసలు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. దీనితో ఈ అసంతృప్తిని పోగొట్టడానికి ఆహా టీమ్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఈ షోకు ఎలాంటి రేటింగ్స్ ఇస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: