అంతకాలం పాటు కెమెరా ముందుకు రాను... అమీర్ ఖాన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన అమీర్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే దంగల్ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న హామీర్ ఖాన్ ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే మూవీ లో అమీర్ ఖాన్ హీరోగా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం తెప్పించలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చడ్డ" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలు నడుమ విడుదల అయిన లాల్ సింగ్ చడ్డ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా దంగల్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అమీర్ ఖాన్ ఆ తరువాత తక్స్ ఆఫ్ హిందుస్థాన్ , లాల్ సింగ్ చడ్డ మూవీ లతో వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.. ఓ కార్యక్రమంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ ... నటుడి గా మూవీ ని చేస్తున్నప్పుడు జీవితం లో ఏదో కోల్పోయాను అన్న భావన కలుగుతుంది. ప్రస్తుతం ఛాంపియన్స్ మూవీ చేయాల్సింది. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలి. కుటుంబం తో సంతోషంగా గడపాలి అని ఉంది , మరో సంవత్సరం నర పాటు కెమెరా ముందుకు వచ్చే ప్రసక్తే లేదు అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: