400 కోట్ల క్లబ్ లో కాంతార?

Purushottham Vinay
రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార‘.ఈ సినిమాని హోంబలే ఫిలిం సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ, హీరో రిషబ్‌ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. గీతా ఫిల్మ్‌ డిస్టిబ్యూషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 15న కాంతార సినిమా విడుదల అయ్యింది. ఐతే ఈ మువీ విడుదలైనప్పటి నుంచి కూడా భారీ అంచనాలకు మించి అన్ని రికార్డులను కూడా బ్రేక్‌ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.దేశావ్యాప్తంగా సినీ ప్రియుల కళ్లన్నీ ఈ చిత్రంవైపే వున్నాయి. ఒక డబ్బింగ్‌ సినిమా అసలు ఇంతటి ఆదరణ పొందడం సినీ చరిత్రలో అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా కాంతార మువీలోని ఎమోషన్స్‌ అయితే తెలుగు ప్రేక్షకుల మనసును బాగా గెలుచుకున్నాయని చెప్పాలి. ఏకంగా 9 టాలీవుడ్‌ సినిమాలు కాంతార సినిమా దాటికి నెగ్గలేకపోయాయి.ఇన్ని రోజులు అయినా కూడా ఎంత మాత్రం క్రేజ్‌ తగ్గకుండా తెలుగునాట బాగా దూసుకుపోతోంది.


ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే 48 కోట్ల గ్రాస్ ఇంకా 25 కోట్ల షేర్ దాటేసింది. ఓవర్సీస్‌లో కెజిఎఫ్ సినిమా తర్వాత రెండు మిలియన్ మార్క్ అందుకున్న రెండో శాండల్ వుడ్ మూవీగా కూడా కాంతార రికార్డు నెలకొల్పింది.  అటు బాలీవుడ్‌ కొత్త చిత్రాలైన మిలీ, ఫోన్ భూత్‌లు కూడా కాంతార సినిమా దెబ్బకు హడలెత్తిపోతున్నాయి. దసరా పండుగ కానుకగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏ భాషలోనూ రాకపోవడం కాంతార సినిమాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అయ్యింది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించిన ఈ సినిమా కర్ణాటక నాట కెజిఎఫ్‌ని మించిపోయింది. నిజానికి ఇలాంటి సినిమాలు మనకు ఏమాత్రం కొత్తేమీకాకపోయినా.. కథలోని సహజత్వం, దైవత్వం చూపించిన తీరు అయితే ప్రేక్షకుడ్ని కదలకుండా అట్టే కట్టిపెడుతుంది. కన్నడ కాంతార సినిమా రిలీజై నేటికి 39 రోజులైంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు కూడా బాక్సీఫీస్‌ వద్ద కాంతార మువీ దాదాపు రూ.400 కోట్ల వసూలు చేసింది. ఇంకా అలాగే కాంతార సినిమా ఓటిటి ప్రీమియర్ నవంబర్ 18న ఉంటుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: