అతను నా వెంట ఉంటే ధైర్యంగా ఉంటుంది... జాన్వీ కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వి కపూర్ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే గుడ్ లక్ జెర్రీ అనే మూవీ తో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ మిలి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న జాన్వీ కపూర్ ,  ఓర్హన్ అవత్రమని తో తరచూ విహారయాత్రలకు వెళ్తూ ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో హోలోవీన్ సందర్భంగా ఓర్హన్ అవత్రమని నిర్వహించిన పార్టీకి కూడా జాన్వి కాపూర్ హాజరు అయింది. దానితో జాన్వీ కపూర్ కి అతడితో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్న ఎదురైంది. దానితో జాహ్న కాపూర్ ఆ ప్రశ్నకు బదులు ఇచ్చింది.

జాన్వి కపూర్ మాట్లాడుతూ ... ఓర్హన్ అవత్రమని నాకు చాలా రోజుల నుండి తెలుసు. అతను నా వెంట ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అతడి లాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ప్రతి విషయం లోనూ చాలా మద్దతుగా నిలుస్తాడు. అతడిని చాలా నమ్ముతా. అతడు గొప్ప వ్యక్తి అని తాజాగా జాహ్న కపూర్ ,  ఓర్హన్ అవత్రమని గురించి చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో కూడా అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: