త్వరలో ఓటీటీలో ప్రసారం కానున్న ఊర్వశివో రాక్షసివో..!
ఈ సినిమా డిజిటల్ హక్కులను రెండు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా తో పాటు నెట్ ఫ్లిక్స్ సైతం ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా నిబంధనల ప్రకారం 8 వారాలపాటు ప్రదర్శన ముగిసిన తర్వాత ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కాబట్టి డిసెంబర్ ఆఖరి వారంలో ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పిక్చర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమా తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్ ఆధారంగా రూపొందించారు. ఇలా తెలుగులో ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అల్లు శిరీష్ కి ఇకపై అవకాశాలు వస్తాయంటూ కూడా కామెంట్ వినిపిస్తూ ఉండడం గమనార్హం.