సంక్రాంతి బరి నుండి ఆదిపురష్ సినిమా తప్పుకుందా..?

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ ని విడుదల చేయక అప్పటినుంచి ఈ సినిమా చాలా వైరల్ గా మారుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సన్నివేశాలు కార్టూన్ లా ఉన్నాయని.. రావణుడిని చూపించే విధానం హనుమంతుడిని చూపించే విధానం పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయినప్పటికీ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం సంక్రాంతి భరి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ భారీగా ఉండడంతో ఈ సినిమాకి మరిన్ని హంగులు తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో నటించారు. ప్రభాస్ సరసన కృతి సనన్ కూడా నటిస్తోంది. ఈ సినిమా రామాయణ కథ ఆధారంగా పెరకెక్కించడం జరిగింది. ఇక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా వాయిదా పడడానికి ముఖ్య కారణం వి ఎఫ్ ఎక్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు తదితర సినిమాలు విడుదల అవుతూ ఉండడం చేత ఆదిపురుష్ సినిమా వాయిదా వేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తుంది. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: